Monday, October 12, 2009

హెచ్చరిక: భూకంపం రాబోతుందా !

భూ వాతావరణంలో పెను మార్పులు వచ్చినట్టే, భూమి లోపలి పొరల్లో కూడా అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని భూగర్భశాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర ఉపరితల జలాలు విపరీతంగా వేడెక్కడం వల్ల `ఎల్ నినో' అనే విపరీత పరిస్థితి ఏర్పడటంవల్లనే ఇప్పుడు అనేక దేశాల్లో (ఇందులో భారత్ కూడా ఉంది) అయితే కరువులు, కాకుంటే జలప్రళయాలు చోటుచేసుకుంటున్నాయి. వీటికి తోడుగా భూగర్భ పొరలు కదలిపోతున్నాయి. ఈ కారణంగానే సముద్రగర్భంలో పెను భూకంపాలు వచ్చి తద్వారా సునామీలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో కరువు, వరదలు వచ్చిపడ్డాయి. ఈ విపరీత పరిణామాలు ఇక్కడితో ఆగవనీ, పెను భూకంపాలు కూడా రావచ్చని భూగర్భశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఒక వేళ అదే జరిగితే, మానవ తప్పిదాల వల్ల జననష్టం ఎక్కువగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ అవసరాల కోసం ఇటవల కాలంలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. ఒకనాటి అడవులు, కొండలు ఇప్పుడు కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోయాయి. ఫలితంగా ఒక మోస్తరుగా భూమికంపించినా జననష్టం అపారంగా ఉంటుంది. పైగా భూకంపాలను చాలా ముందస్తుగా గుర్తించడం కష్టమే. నాగరికత పేరిట మనం సృష్టించుకున్న అత్యాధునిక సౌకర్యాలే మనకు ఉరితాళ్లుగా మారబోతున్నాయని కూడా పర్యావరణ నిపుణులు ఆవేదన చెందుతున్నారు. సాధ్యమైనంతవరకూ ప్రకృతిని గౌరవిస్తూ, దాని పరిధికి లోబడే జీవించడం నేర్చుకుంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బతికిబట్టకట్టగలిగే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. మరి, దీనిపై మీరేమనుకుంటున్నారు. మీ కామెంట్స్ మాకు పంపించండి. రాబోయే విపత్తులను అధిగమించడానికి ఏం చేయాలో సూచించండి.
-కణ్వస

1 comment:

  1. వెంటనే మా ఏటూరునాగారం(వరంగల్)లో ఒక గుహ వెతుక్కుంటా :)

    ReplyDelete