Friday, October 23, 2009

జగన్ గెలిచినట్టా, ఓడినట్టా?

జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్ర సాఫల్యమైందా, లేక వైఫల్యతే ఎదురైందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. వైఎస్సార్ మరణానంతరం చురుగ్గా సాగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగాలని ఆశించడమే ప్రధాన భూమిక పోషించింది. గడచిన 50 రోజులుగా చెలరేగుతున్న ఊహాగానాలకు తెరదింపే ప్రయత్నం కాంగ్రెస్ అధిష్ఠానం చేసింది. జగన్ ఢిల్లీయాత్రలోని రెండు కోణాలను స్పృశిద్దాం...
గెలిచినట్టే...
  • కొంతకాలంగా మేడం సోనియాను కలవాలన్న లక్ష్యం నెరవేరింది. అది కూడా రోశయ్య కంటే ముందే కలవాలన్న కోరిక తీరింది.
  • రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై తన అభిప్రాయాన్ని మేడంకు చెప్పే అవకాశం దక్కింది.
  • `అన్నీ నాకిడిచిపెట్టేయ్ జగన్, నేను చూసుకుంటా...'అంటూ సోనియా చెప్పడంతో జగన్ లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.
  • `రాబోయే కాలమంతా మీలాంటి యువనేతలదే'-అంటూ సోనియా అనడంతో జగన్ లో ఆశలు చిగరించాయి.
  • దక్షిణాదిన ఉన్న ఏకైక కాంగ్రెస్ పాలితరాష్ట్రంలో పార్టీ అంతర్గత కుమ్ములాటలు తగవని సోనియా అనడంతో జగన్ లో మార్పుకు బీజం పడింది.
  • మేడం సోనియా పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంచడానికి ఈ పర్యటన దోహదపడింది.
  • అధిష్ఠానం పట్ల గౌరవం పెరగడానికి పర్యటన పనికొచ్చింది. తన ప్రమేయం ఉన్నాలేకున్నా జరిగిన అప్రదిష్ఠ మచ్చలను చెరిపేసుకోవడానికి దోహదపడింది.
  • ఇప్పట్లోకాకపోయినా భవిష్యత్ లో తనకలలు నెరవేరుతాయన్న ఆశలు చిగురించాయి.
ఓడినట్టే...
  • మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వెల్లడవుతున్న వేళలో ఎవ్వరినీ నొప్పించడం మేడంకు ఇష్టంలేదు. సరిగా అదే సమయంలో జగన్-కెవీపీ ద్వయం సోనియాను కలిశారు. మేడం వారితో కొద్దిసేపు మాట్లాడారు. కొన్ని పత్రికల్లో వచ్చినట్టు ఆమె వీరితో సుదీర్ఘంగా (45 నిమిషాలో గంటో) చర్చించలేదు. ఆమె కాసేపు మాట్లాడిన తరువాత అక్కడే ఉన్న సీనియర్లతో తాజా పరిణామాలు చర్చించారు.
  • `అన్నీ నాకిడిచిపట్టేయ్ జగన్, నేను చూసుకుంటా..' అని సోనియా అనడంలోని అంతరార్థమేమిటో జగన్ కు అర్థంకాలేదు. ఈ మాటల్ని పాజిటీవ్ గా తీసుకోవాలో, నెగెటీవ్ గా తీసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కున్నారు.
  • నిన్నమొన్నటి వరకూ ఎప్పుడూ తన వయసు గురించికానీ, అనుభవం గురించికానీ మాట్లాడని జగన్ ఢిల్లీ నుంచి వచ్చీరాగానే వాటి ప్రస్తావన తెస్తూ, `నా వయసు 37 ఏళ్లే. భవిష్యత్ చాలా ఉంది. సీఎం కుర్చీ అంటే తేలిగ్గా లాక్కునే మామూలు కుర్చీకాదు. నేను అధిష్ఠానం చెప్పినట్టు నడుచుకుంటాను. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తాను'
  • తండ్రి దర్మరణం పాలైన తరువాత జగన్ ఢిల్లీ వెళ్లడం ఇదే మొదటిసారి. స్టాండింగ్ కమిటీ సమావేశం నెపంతో రోశయ్య కంటే ముందే ఢిల్లీ వెళ్ళి తనమనసులోనిమాట మేడం చెప్పే పయత్నం చేశారు. జగన్ కుటుంబానికి కలిగిన నష్టం, శోకాన్ని దృష్టిలో ఉంచుకుని సోనియా అపాయింట్మెంట్ ఇచ్చారు.
  • కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో బలోపేతమవుతున్న టైమ్ లో ఏ రాష్ట్రంలో కూడా అనిశ్చిత పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే జగన్ వివాదానికి ఫల్ స్టాప్ పట్టేయాలని సోనియా భావించారు. అందకే స్టాండింగ్ కమిటీ సమావేశం పేరిట జగన్ ను ఢిల్లీ రప్పించి ఆయన చెప్పిందివిని, తాను చెప్పదలచ్చుకున్న రెండు ముక్కలూ చెప్పేశారు.
  • అధిష్ఠానం నిర్ణయానికి జగన్ కట్టుబడేలా జగన్ ని ఒప్పించగలిగారు.
  • జగన్ తరువాత అదేరోజు కే.కేశవరావు కూడా సోనియాను కలిశారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన మాటలనుబట్టి, అధిష్టానం తన పంతం నెగ్గించుకున్నట్టే కనబడింది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ముందు పిల్లచేష్ఠలు కుదరవని చెప్పడంలో అదిష్ఠానం సఫలీకృతమైనట్టు అర్థమైంది. అదిష్ఠానం ఎలా చెబితే అలా నడుచుకుంటానంటూ జగన్ ఇప్పుడు చెప్పారనీ, కానీ, ఈమాటేదే నెలరోజుల ముందే అని ఉంటే, జగన్ అనుచరగణం వల్ల ఇంతగా డామేజ్ అయిఉండేది కాదన్న అర్థం వచ్చేలా కేకే చెప్పారు. కేకే మొహంలో సీనియర్లే గెలిచారన్న ఆనందం కనిపించడం కొసమెరుపు.
- కణ్వస

1 comment:

  1. మేడం ని 'నోడి ' తానోడెనా?
    తానోడి 'మేడం' ని సంతొష పరిచెనా?

    చీర్స్
    జిలేబి.
    http://www.varudhini.tk

    ReplyDelete