Wednesday, October 21, 2009

వైఎస్సార్ అల్లుడి గుప్పెట్లో వందలకోట్లు !

వైఎస్సార్ ఎక్కిన హెలికాప్టర్ కూలడంలో కుట్ర జరిగిందంటూ ఒక పక్క సంచలనాత్మక కథనాలు వెలువడుతున్న నేపథ్యంలోనే మరోపక్క వైఎస్సార్ కుటుంబసభ్యులపైన కూడా నీలినీడలు పరుచుకుంటున్నాయి. ఎస్ఎంఎస్ ల ద్వారా, ఫోన్ల ద్వారా చెప్పుకుంటున్న గుసగుసలకు అక్షర రూపం కల్పిస్తే...
  • వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కుమారుడు జగన్ కు ఇచ్చింది ఇవ్వగా కోట్లాది రూపాయలను అల్లుడు బ్రదర్ అనిల్ కు ఇచ్చారు.
  • వైఎస్సార్ కొన్ని విషయాల్లో అల్లుడి మాటలనే విశ్వసించేవారు. ఆ సమయంలో జగన్ మాట వినేవారు కారు.
  • వ్యాపార వ్యవహారాల్లో జగన్ కు మద్దతు ఇచ్చినా, రాజకీయ ఎత్తుగడల విషయంలో తండ్రీకొడుకుల మధ్య తేడాలు వచ్చేవి. అలాంటి సమయాల్లోనే అల్లుడు అనిల్ దగ్గరయ్యేవారు.
  • ప్రియమిత్రుడు కేవీపీ, అల్లుడు అనిల్ చెప్పిన మాటలు వినడంతో వైఎస్సార్ తన కుమారుడు జగన్ కు కొన్ని సందర్బాల్లో దూరం అయ్యారు.
  • మతపరమైన వ్యవహారాలు నడపడంలో దిట్ట అయిన బ్రదర్అనిల్ మామగారిని ఇట్టే ఆకర్షించుకున్నారు.
  • వందలాది కోట్లు బ్రదర్ అనిల్ తన గుప్పెట్లో పెట్టుకున్నారు.
  • వైఎస్సార్ దుర్మరణంతో ఆ ఇంట్లో ఒక్కసారిగా `శూన్యత' ఆవరించింది. (ఇది రాజకీయ శూన్యత కాదు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన శూన్యత)
  • ఆ శూన్యత నుంచి విభేదాల చిచ్చు రగులుకుంది. అది చివరకు బావ, బావమరిదిల మధ్య అఘాతాలు సృష్టిస్తోంది.
  • తండ్రి అప్పగించిన వందలాది కోట్లు ఇవ్వమంటూ జగన్ ఒత్తిడి తెచ్చారు. కేవీపీ చేత మధ్యవర్తిత్వం చేయించారు.
  • కేవీపీ సౌమ్యంగా సాగించిన మధ్యవర్తిత్వం నచ్చకపోవడంతో జగన్ ఆ పెద్దాయన్ని కూడా పక్కనపెట్టారు.
  • కుటంబవ్యవహారాలు చక్కదిద్దడానికి జగన్ ఇప్పుడు ఒంటరి పోరాటానికి దిగారు.
  • తండ్రి మరణంతో తలెత్తిన ఈ ఆర్థిక సమస్యనుంచి ఎలా బయటపడాలా అని జగన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
కూలింది కుట్రతోనే- అంటూ వైఎస్సార్ తనయుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున దర్యాప్తు, విచారణ మరింత కట్టుదిట్టంగా జరుపవచ్చు. అదే జరిగితే అసలు సంగతి ఎలా ఉన్నా, తీగలాగితే డొంకంతా కదిలినట్టు అవుతుందన్న భయం వైఎస్సార్ బంధువర్గంలో వ్యక్తమవుతోంది.
మరి ఈ ఆరోపణల్లో నిజం ఎంతో... నారాయణ...నారాయణ...

3 comments:

  1. ysr sampadana anta baga lekka katti chepparu mari babu sapadana yento lekka vesi cheppochu kada

    ReplyDelete
  2. చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ ఆస్తుల విలువ ఎంతో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ మీద వేసిన అప్పుల భారం యాభై వేల కోట్లకి పైనే. వాడు అప్పుగా తెచ్చిన డబ్బులలో మంత్రులు ఎంత పంచుకున్నారు, MLAలు ఎంత పంచుకున్నారు, అధికారులు ఎంత పంచుకున్నారు, జన్మభూమి కాంట్రాక్టర్లు ఎంత పంచుకున్నారు, ఈ లెక్కలన్నీ తేలాల్సి ఉంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల మీద పన్నుల భారం వేసి దివాళా తియ్యించడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ కి ఎన్ని వేల కోట్ల నష్టం వచ్చిందో కూడా అంచనా వెయ్యాలి.

    ReplyDelete
  3. కొంప తీసి ఈ నారదుడు తెలుగు దేశం ఏజెంటేమో.

    ReplyDelete