Monday, October 19, 2009

రోశయ్య పక్షాన కేవీపీ?

వైఎస్సార్ ఆప్తమిత్రుడు కేవీపీకి కాలం కలిసిరావడంలేదు. గడచిన నాలుగైదేళ్లుగా తన మాటనెగ్గించుకున్న కేవీపీ ఇప్పుడు తన స్నేహితుని కొడుకు జగన్ కి సీఎం పోస్టు ఇప్పించలేకపోతున్నాడు. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలో గోడువెళ్లగక్కుకున్నా ఫలితం దక్కలేదు. మరో పక్క జగన్ అనుయాయులు చేస్తున్న నానా ఆగీతో కేవీపి విసిగిపోయారు. చెప్పినా వినని అధిష్టానం, రెచ్చిపోతున్న జగన్ సేన కేవీపీకి మనస్తాపం కలిగిస్తున్నాయి. దీంతో ఏదో ఒక రోజు రోశయ్య పక్షానికే తన ఓటు వేసే పరిస్థితి రావచ్చన్న వాదన బలపడుతోంది.
అధిష్టానం మనోగతాన్ని గ్రహించిన కేవిపి ఆ విషయాన్ని జగన్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది. అధిష్టానం మనకు అను కూలంగా లేనందున, అధినేత్రి మనసు మారి అనుకూల నిర్ణ యం తీసుకునే వరకూ మౌనంగా ఉండాలని, ఆ లోగా ఎమ్మె ల్యేలు, మంత్రులతో ఎలాంటి ప్రకటనలు చేయించకుండా ఉంటే బాగుంటుందని జగన్‌కు ఇటీవలే సలహా ఇచ్చినట్లు తెలిసింది. అయితే, జగన్‌ వర్గీయులు మాత్రం ఆయనను సిఎం చేయాలన్న పట్టుదలతోనే ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల్లో అధిష్టానంపై వ్యతిరేకంగా అసహనం పెరుగు తోంది. సంపూర్ణ మెజారిటీ ఉన్నందున బయటకెళ్లిపోదామని జగన్‌పై ఒత్తిడి చేస్తున్నారు. దీనితో కెవిపి పరిస్థితి ఇరకాటంలో పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న సమా చారం ప్రకారం.. త్వరలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక నిర్ణ యానికి రానున్నట్లు తెలుస్తోంది. కెవిపి మాత్రం వారిని ఇంకా సముదాయిస్తూనే ఉన్నారు. కానీ, వారంతా ఎవరిమాట వినే పరిస్థితి లేదు. ఇంకోవైపు.. డిసిసిలు, జిల్లా స్థాయి నాయకులు జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని హామీలిస్తున్నారు. జగన్‌ శిబిరం మాత్రం న్యాయం జరగకపోతే బయటకొచ్చేయాలంటూ ఆవేశంతో ఊగిపోతోంది.
ఈ నేపథ్యంలో.. కెవిపి పాత్రేమిటన్న అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ జగన్‌పై అనుచరుల ఒత్తిడి పెరిగి ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే అప్పు డు కెవిపి ఎటు వైపు ఉంటారన్న ఆసక్తికరమైన ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. తన తర్వాత జగన్‌ను సిఎంగా చూడా లన్నది వైఎస్‌ కల. అలాంటి ప్రాణమిత్రుడి కుమారుడైన జగన్‌ను సిఎంగా చేసేందుకు కెవిపి తన ప్రయత్నాలు చేసి చివరి వరకూ శ్రమించారు. అది ‘ఇప్పట్లో’ అసాధ్యమని తేలిపోయింది. ఈ క్రమంలో జగన్‌ శిబిరం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు కెవిపి పాత్రేమిటన్నదే పార్టీ నేతల సందే హం. జగన్‌తోనే ఉంటూ వైఎస్‌ మాదిరిగానే ఆయన ఉన్నతికి కృషి చేస్తారా? అదే జరిగితే ఇప్పుడు కొనసాగుతున్న ప్రజా రక్షణ, భద్రత కమిటీ ఛైర్మన్‌ పదవికి నైతిక విలువల ప్రకారం రాజీనామా చేస్తారా? లేక.. తనను ఈ స్ధాయికి చేర్చిన కాంగ్రె స్‌ నిర్ణయించిన రోశయ్య పక్షం బాహాటంగా నిలుస్తారా? వంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చనీయాంశమయ్యాయి.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి రోశ య్యతో కెవిపి రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించి నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లేముందు కెవిపి సిఎంను కలిశారు. అధిష్టానం అందించిన సంకేతాలను, మనోగతాన్ని తాను జగన్‌కు స్పష్టం చేశానని, అయినప్పటికీ వారంతా ఎవరి మాట వినే పరిస్థితిలో లేరని వివరణ ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో తన పాత్ర నామమాత్రమేనని, మీకు వ్యతిరేకంగా తానెలాంటి చర్యలను ప్రోత్సహించడం లేదని, మంత్రులకు సైతం మీకు సహకరించమని సూచించానని కెవిపి ఆయనకు వివరిం చినట్లు తెలిసింది. దానికి తగ్గట్టే ఇటీవలి కొద్దిరోజుల నుంచి కెవిపి సిఎంతో సన్నిహితంగా ఉండేందుకు యత్నిస్తున్నారు. పేషీలో రోజూ ఆయనను కలుస్తున్నారు. విఐపిలను తీసుకువెళ్లి వరద బాధితులకు విరాళాలిప్పిస్తున్నారు.

No comments:

Post a Comment