Wednesday, October 21, 2009

రామ్‌చరణ్‌ కి ముచ్చటగా మూడోది !


మగధీర చిత్రం హిట్‌ కావడంతో జోరుమీదున్న రామ్‌చరణ్‌తే మూడో చిత్రం బుధవారం ప్రారంభమైంది. నగరంలోని నోవాటెల్‌ హోటల్‌లో అంజనా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగబాబు విలేకరులతో మాట్లాడారు. ఈ చిత్రంలో కథానాయకగా జెనీలియాను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, దాసరినారాయణరావు, డి. రామానాయుడు, అల్లు అరవిందు, రాఘవేందరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment