Monday, October 12, 2009

లేచింది మహిళా లోకం

ఈసారి నోబెల్ ప్రైజ్ లు అందుకోవడంలో మహిళలు పోటీ పడుతున్నారు. ఆర్థికశాస్త్రంలో అమెరికా వనిత ఎలినర్ ఓస్ట్రోం నోబెల్ బహుమతికి ఎంపిక కావడంతో ఇప్పటివరకు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డుకు ఎంపికైన మహిళల సంఖ్య ఐదుకు పెరిగింది. మరో ఆశ్చర్యకరమైన సంగతేమిటంటే, 1969లో ఎకనామిక్స్ లో నోబెల్ బహుమతిని చేర్చినప్పటి నుంచి ఇంతవరకు ఓ మహిళకు ఈ పురస్కారం దక్కలేదు. 1886లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించడానికి ముందు రాసిన విల్లులో ఆర్థిక శాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి బహుమతి ఇవ్వమంటూ పేర్కొనలేదు. అయితే నోబెల్ జ్యూరీ ఆ తరువాత ఈ రంగాన్ని కూడా చేర్చారు. ఎలినార్ ఓస్ట్రోంతో పాటుగా ఆలివర్ విలియంసన్ సంయుక్తంగా నోబెల్ బహుమతిని అందుకుంటారు. డిసెంబర్ 10న నోబెల్ జయంతి రోజున స్వీడన్ రాజు చేతులమీదగా వీరిద్దరూ నోబెల్ పురస్కారాలను స్వీకరిస్తారు.
రోమానియాలో పుట్టి జర్మనీలో స్థిరపడిన హెర్టా ముల్లెర్, సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకుని నాలుగవ వనితగా నిలిచారు. కాగా, మెడిసన్ రంగంలో ఎలిస్బత్ బ్లాక్ బర్న్, కరోల్ గ్రీడెర్ (అమెరికా), రసాయన శాస్త్రంలో ఆదా యోనత్ (ఇజ్రేల్) కూడా నోబెల్ బహుమతులు అందుకున్న మహిళామణుల జాబితాలో చేరారు.
2004లో ముగ్గురు మహిళలకు నోబెల్ బహుమతులు దక్కాయి.

3 comments: