Wednesday, October 7, 2009

ఫోకస్: `ట్రస్ట్' మీ ఫ్లీజ్...

వరద తగ్గుముఖం పట్టగానే `విరాళాల వరద' రాష్ట్రాన్ని చుట్టుముడుతోంది. మానవత్వం అడుగంటుతున్న వేళలో ధన, వస్తు రూపంలో విరాళాలు ఇవ్వడానికి దాతలు క్యూకడుతుండటం హర్షనీయ పరిణామమే. అయితే, ఇదే సమయంలో స్వార్థపూరిత సంస్థలు దాతలను బుట్టులో పడేసుకునే పనిలో నిండా మునిగిపోయాయి. వివిధ రకాల ఫౌండేషన్స్, సంస్థలు, సేవా సంఘాలు వరద బాధితులకు సహాయం అందించడానికి ముందుకు వస్తున్నాయి. వీటిలో కొన్ని బోగస్ వేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దాతలు అయోమయంలో పడిపోతున్నారు. అన్నార్తులను ఆదుకోవడం కోసం ముందుకు తరలివస్తున్న కోట్లాది మందిని బురిడీ కొట్టేంచేందుకు అనేక సంస్థలు ఆకర్షణీయమైన ప్రకటనలతో వలలు విసురుతున్నాయి. తామందించే సాయం నేరుగా బాధితులకు చేరుతుందా?లేక ఆర్గనైజర్ల జేబులోకి చేరుతుందా తెలియక దాతలు కలవరపడుతున్నారు.
దాతల నుంచి తమకందిన భూరి విరాళాలను ఒడుపుగా కాజేసే ఘనులున్నారు. అందుకే దాతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేరుగా ఛీప్ మినిస్టర్ సహాయ నిధికే చెక్కులు పంపితే చాలా మంచిది. అలాగే, ప్రభుత్వం లేదా పూర్తిగా నమ్మదగ్గ సంస్థకు మాత్రమే వస్తువులు, దుస్తులు అందించడమే మేలు. బాధితుల కడగండ్లు తీర్చాలన్న తపనతో దాతలు ఇచ్చే విరాళాలు స్వార్థపరుల హస్తాల్లో చిక్కుకోకుండా చూడాలి.
విరాళాలు పంపదలచుకున్నవారు క్రాస్డ్ చెక్ ని చీఫ్ మినిస్టర్ రలీఫ్ ఫండ్ పేరిట సెక్రటరేట్, హైదరాబాద్ కు పంపించడం సర్వోత్తమం. మిగతా ఎవరికి అందించినా అది దీనికి సాటిరాదు. బహుశా అందుకేనేమో జూనియర్ ఎన్టీఆర్ కూడా 20 లక్షల రూపాయల చెక్ ను తన తాతగారిపేరిట ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ కి కూడా ఇవ్వకుండా నేరుగా ముఖ్యమంత్రి రోశయ్యకే ఇచ్చారు. అలా అని టిడిపీతో ఆయన విభేదించారనో, లేదా చంద్రబాబుకు దూరం అయ్యారనో అనుకోవాల్సిన పనిలేదు. ఒక వస్తువును కొనుక్కునేటప్పుడు ఐఎస్ఐ మార్క్ ఎలా చూస్తామో, అలాగే మనం దానంగా ఇచ్చేటప్పుడు కూడా `విశ్వసనీయత'ను చూడటంలో తప్పులేదు. ఆ విశ్వసనీయత ఈ తాతగారిలో (రోశయ్యలో) జూనియర్ ఎన్టీఆర్ చూశారేమో..ఏమే.అంరతేకానీ, `మామకు షాకిచ్చిన అల్లుడు' అంటూ ఒక పేపర్ రాసినంతగా సీను లేదు. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకంటే తన కెరీర్ కే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారన్నదే నిజం. ఇలాంటప్పుడు తోటి హీరోలకు(అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్) పోటీగానే, ప్రచారం కూడా ఎక్కువ రావాలనే ఎన్టీఆర్ వ్యూహాత్మకంగా కేవీపీతో కలిసి సీఎంను కలిశారు. రాజకీయాల్లో నిండా మునిగి మొన్నీమద్యనే చేతులు కాల్చుకున్న ఎన్టీఆర్ ఇప్పట్లో మళ్ళీ అలాంటి సాహసం చేయకపోవచ్చు.
-కణ్వస

3 comments:

  1. You have to appriciate Jr. N.T.R for his way of thinking. he always said that he would be part of TDP but he never said that TDP is the only thing he can get identified. I appriciate his move from an individual point of view.

    ReplyDelete
  2. జూనియర్ ఎన్టీఆర్ నాటకాలు ఆడుతున్నాడు. తన కెరీర్ కు ఎక్కడ నష్టం వస్తుందోనని CBNకు దూరమవుతున్నాడు. ఇది ద్రోహం. సహించరాని ద్రోహం.

    ReplyDelete
  3. మీ బ్లాగు పేరు సార్ధకం చేద్దమనుకున్తున్నారా ఏమిటి పాపం తను తే.దే.పా కి కూడా 20లక్షలు ఇచ్చాడు కదా?:)

    ReplyDelete