Monday, September 28, 2009

మీడియా శవ రాజకీయం- 1

వైఎస్సార్ మరణానంతరం శవ రాజకీయాలు జరిగాయంటూ మీదియా కోడై కూసింది. ఐతే అసలు సిసలు శవ రాజకీయాలు చేసింది మీడియానే.
౧. వై.ఎస్.ఆర్ పార్థివ శరీరం ఎల్.బి స్టేడియం నుంచి ఇడుపులపాయకు చేరాక ముందే జగన్ గుప్పెట్లో ఉన్న బడా పారిశ్రామిక వేత్తలు మీడియాని లోబరుచుకున్నారు.
౨. జగన్ సి.ఎం అవుతారా ? అన్న ప్రశ్నకు ఎస్.ఎం.ఎస్ ద్వారా సమాధానాలు రాబట్టే ప్రక్రియను రెండు ప్రముఖ ఛానల్స్ చేపట్టాయి. ఈ పనిచేసిపెట్టినందుకు ఆ చానెళ్లకు భారీగా ముడుపులు అందాయని చెప్పుకుంటున్నారు.
౩. ఇడుపులపాయలో అంత్యక్రియలు పూర్తి కాక ముందే ఎస్.ఎం.ఎస్. ఫలితాలలో ఎనభై శాతానికి పైగా జగన్ కి అనుకూలత వచ్చేలా చూశారు.
౪. రాష్ట్ర ప్రజలలో 80 శాతం మంది జగన్ సి.ఎం కావలనుకున్తున్నట్లు భ్రాంతి కలిగించారు.
  • మీడియాను అడ్డు పెట్టుకొని జగన్ దగ్గర ప్రాభవం సంపాదించాలని ప్రయత్నించినా పారిశ్రామిక వేత్తలెవరు ?
  • ( వివరాలురెండో భాగంలో)

No comments:

Post a Comment