Tuesday, September 29, 2009

మంత్రుల్లో చీలిక

జగన్ సీఎం కావాలన్న ఉద్యమం ఊపందుకుంది. ఢిల్లీ అధిష్ఠానం వ్యవహారాన్ని ఇప్పటికీ నానుస్తూనే ఉండటంతో జగన్ వెంటనే మేమంతా ఉంటామంటూ శపథాలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలలో కొంతమంది మెల్లగా జరుకుంటున్నారు. `నారద లోకం' సేకరించిన కీలక సమాచారం ప్రకారం, జగన్ పక్షానే ఉంటామంటూ సంతకాలు చేసిన ఎమ్మెల్యేలలో (వీరిలో కొంత మంది మంత్రులు కూడా ఉన్నారు) సగానికి పైగా డైలమాలో పడ్డారు. వైఎస్సార్ మరణం అనంతరం వారం పదిరోజుల్లోనే జగన్ సీఎం అవుతారని భావించి మొదట్లో ఊగిపోయిన వారంతా సుమారు నెలరోజులు కావస్తున్నా సమస్య ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉండటంతో పట్టు సడలిపోతున్నది. ఏతావాతా రాష్ట్ర కాంగ్రెస్ చీలిక దిశలోనే పయనిస్తోంది. ఏవర్గానికీ మెజారిటీ లేకపోతే పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా ప్రతిపక్షాల కూటమికి లాభసాటి అవుతుంది.

No comments:

Post a Comment