Tuesday, September 29, 2009

`నష్టాల్లో' జగన్ !

వైఎస్ జగన్ నష్టాల్లో పడుతున్నారు! ఈ నష్టం వ్యాపారంలో వచ్చిందికాదు. రాజకీయాల్లో వచ్చిన నష్టమే. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుతప్పే అవుతుంది. జగన్ సీఎం కావాలంటూ అభిమానులు వీరంగం చేయడం చివరకు జగన్ కే నష్టం వాటిల్లుతోంది. ఈ నష్టం వాటిల్లిన పరిణామ క్రమం ఇలా ఉంది...
  • వైఎస్సార్ మరణం అనంతరం కేవలం కొద్ది గంటల్లోనే జగన్ సీఎం కావాలంటూ ఎమ్మెల్యేలు, మంత్రులు బహిరంగ ప్రకటనలు చేయడం.
  • జగన్ సీఎం కావాలనుకుంటున్నారా? అంటూ మీడియాచేత సర్వేలు జరిపించడంసంతకాల సేకరణ ఉద్యమాన్ని హడావుడిగా చేపట్టడం.
  • గాంధీభవన్ లో పిసీసీ అధ్యక్షుడు డీఎస్ ను జగన్ వర్గీయులు అడ్డుకోవడం.
  • రోశయ్యను తాత్కాలిక ముఖ్యమంత్రే అంటూ ఎమ్మెల్యేలు చులకనగా చూడటం.
  • మంత్రివర్గంచేత ప్రమాణస్వీకారం చేయించే కార్యక్రమాన్ని రోశయ్య తలపెట్టగా, కొంత మంది జగన్ తో రహస్య మంతనాలు ఆడటం.
  • నల్లకాలువ వద్ద బహిరంగ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొనడం.
  • బహరంగ సభలో జగన్ ఎక్కడా కాంగ్రెస్ అధిష్టానం, సోనియా పేర్లు ఉచ్ఛరించకపోవడం.
  • ఖమ్మం జిల్లాలో సోనియా చిత్రం ఉన్న ఫ్లెక్సీని చింపేయడం.అనంతరం, రాజమండ్రిలో బస్సులను దగ్ధం చేయడం.
  • ఇంతజరుగుతున్నా, తాను సీఎం కావాలని అనుకుంటున్నారా, లేదా అన్న విషయంలో జగన్ విస్ఫష్టమైన ప్రకటన చేయకపోవడం.
  • అధిష్ఠానం దిగిరాకపోతే, చీలిక తప్పదన్న సంకేతాలు ఇవ్వడం.
  • నూరేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని సరిగా అర్థం చేసుకోకపోవడం.

No comments:

Post a Comment