Monday, September 28, 2009

సాక్షి మొదటి పేజీ కథ

నారాయణ...నారాయణ... ఈవాళ్టి సాక్షి (విజయదశమి) సంచిక చూశారా మరి... మొదటి పేజీలో భారీ సెట్టింగ్ లతో భారతి సిమెంట్ వ్యాపారప్రకటన లేదూ...దాని వెనుక ఉన్న కథ చెబుతా వినండి...
౧. మొదటి పేజీలో అసలు పెట్టాల్సింది - ఖమ్మం జిల్లాలో జగనానుచరులు (అసురులు కారు) కాంగ్రెస్ మాతాశ్రీ (సోనియా) ఫ్లెక్సీని కసిగా చింపేసిన వార్తను.
౨. దీన్ని పెడితే జగన్ ఇజ్జత్ పోదూ... జగన్ అనుయాయుల బాగోతం ఏ ముఖం పెట్టుకుని ముఖపత్రం (మొదటి పేజీలో) వేస్తారు చెప్పండి.
౩. ఇంతకాలం ఈనాడు పత్రిక అడ్డగోలుేగా, వక్రభాష్యాలు చెబుతున్నదని తీవ్రాతితీవ్రంగా ఖిండిస్తూ పేజీలకు పేజీలు గీసిపారేసిన సాక్షీయులకు ఇప్పుడు చేతులురాలేదు. జగనానుచరులు చేసిన వికృత చేష్ఠలను ఎలా సమర్దించుకోవాలో తెలియక, ఒక వేళ తెలిసినా వాటిని మొదటి పుటలో ముద్రించడం ఇష్టంలేక లోపలి పేజీలో దాక్కునేలా చేశారు.
౪. ఈ సంకట పరిస్థితికి వేరేదారిలేక జగన్ గ్రూప్ నుంచే వస్తున్న భారతి సిమెంట్ వ్యాపార ప్రకటనతో తొలి పుటను నింపేశారు.
శహభాష్ సాక్షి... గ్రూప్ కంపెనీలను బాగానే వాడుకుంటున్నావ్. అందుకు ఈ సంచికే నిలువెత్తు సాక్షి. నారాయణ...నారాయణ..

No comments:

Post a Comment